- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoist Bund: ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల నిలిపి వేత.. ఎందుకంటే?
ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం మావోయిస్టులపై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఆపరేషన్ కగార్ పేరుతో (Operation Kagar) ప్రభుత్వం మావోయిస్టులపై చేస్తోన్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. అగ్రనాయకుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ రోజు దేశ వ్యాప్త బంద్కు మావోయిస్టులు (Maoist) పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో ఏవోబీలో హై అలర్ట్ప్రకటించారు. ప్రత్యేక బలగాలు ముమ్మంగా కూంబింగ్చేస్తూ ఏవోబీని (AOB) జల్లెడ పడుతున్నాయి. ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు చేపడు తున్నారు. బంద్ నేపథ్యంలో (Bund) అధికారుల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసుల నిలిపివేశారు. విశాఖ-భద్రాచలం నైట్ సర్వీసులు కూడా నిలిపివేశారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు స్మారక సభలు నిర్వహించనున్నట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి 540 మంది మావోయిస్టులు మరణించారని, చర్చలకు సిద్ధమని చెప్పినా ఆపరేషన్ కగార్ ఆపడంలేదని ఆరోపిస్తున్న మావోయిస్టు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గతంలో ఒక లేఖ విడుదల చేశారు.






