ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవులు

by Disha Web Desk 13 |
ఢిల్లీ లిక్కర్ కేసులో  అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవులు
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సీబీఐ కేసులో అప్రూవర్ గా మారారు. ఈడీ కేసులో ఇప్పటికే మాగుంట రఘవ అప్రూవర్ గా మారగా తాజాగా సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారడానికి రాఘవ చేసుకున్న దరఖాస్తును తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన దినేశ్ అరోరా, శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్లుగా మారగా తాజాగా మాగుంట రాఘవ సైతం అఫ్రూవర్ గా మారడంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. కాగా మాగుంట రాఘవ తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇటీవలే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రాఘవులు అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story