- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవులు
దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సీబీఐ కేసులో అప్రూవర్ గా మారారు. ఈడీ కేసులో ఇప్పటికే మాగుంట రఘవ అప్రూవర్ గా మారగా తాజాగా సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారడానికి రాఘవ చేసుకున్న దరఖాస్తును తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన దినేశ్ అరోరా, శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్లుగా మారగా తాజాగా మాగుంట రాఘవ సైతం అఫ్రూవర్ గా మారడంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. కాగా మాగుంట రాఘవ తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇటీవలే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రాఘవులు అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.