విశాఖ జిల్లా మాడుగుల టీడీపీకి ఊహించని మరో షాక్‌

by Disha Web Desk 16 |
విశాఖ జిల్లా మాడుగుల టీడీపీకి ఊహించని మరో షాక్‌
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా మాడుగుల టీడీపీకి మరో భారీ షాక్‌ తలిగింది. స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు నామినేషన్‌ దాఖలు చేవారు. ఇప్పటికే రెబల్‌ అభ్యర్థిగా పైలా ప్రసాదరావు నామినేషన్‌ వేశారు. మాడుగుల టీడీపీ అభ్యర్థిగా బరిలో బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ముగ్గురు నేతలు బరిలో ఉండటంతో మాడుగుల తెలుగు తమ్ముళ్లలో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బండారునే ఉంటారని, మిగిలిన ఇద్దరితో అధినేత చంద్రబాబు మాట్లాడి పంచాయితీని క్లియర్ చేస్తారని తెలిపారు. పైలా ప్రసాదరావు, గవిరెడ్డి రామానాయుడు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నారు.

కాగా మొన్నటి వరకూ బండారు సత్యనారాయణ సీటు ఖరారు కాలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బండారుకు మాడుగుల సీటు కేటాయించారు. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని పైల ప్రసాదరావు, గవిరెడ్డి రామానాయుడు వ్యతిరేకించారు. మాడుగుల రెబల్ లభ్యర్థులుగా ఇద్దరూ నామినేషన్ వేశారు. దీంతో మాడుగుల టీడీపీలో విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.



Next Story

Most Viewed