కాళ్ళ నుండి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్న లోకేశ్ : మంత్రి ఆర్‌కే రోజా

by Disha Web Desk 21 |
కాళ్ళ నుండి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్న లోకేశ్ : మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ పేరుతో దోచుకున్నారు అని మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా ఇంకా స్కాం ఎలా జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఆర్‌కే రోజా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని చంద్రబాబు,లోకేశ్‌లు కలిసి దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారన్నారు. స్కాంలలో ఇరుక్కుని లోకేశ్ ఢిల్లీ పారిపోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాళ్ళ నుండి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నాడు అని విమర్శలు చేశారు. ఎర్రబుక్‌లో రాసుకుంటానని బెదిరిస్తున్న లోకేశ్ ...ఆయన పేరును సీఐడీ మెమోలో రాసారని గుర్తు చేసుకోవాలి అంటూ సెటైర్లు వేశారు. హెరిటేజ్‌లో 2శాతం షేర్లు అమ్మితెనే రూ.400కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారని అంటే చంద్రబాబు ఆస్తి రూ.20వేల కోట్లా అని మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. చంద్రబాబు అఫిడవిట్‌లో ఆ విషయం పొందుపరిచారా అని రోజా నిలదీశారు. ఖర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు. అక్కడినుండి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది అని మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇల్లు రూ.600 కోట్లు అంటూ మంత్రి ఆర్‌కే రోజా సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబును ఎవరూ కాపాడలేరు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు అని మంత్రి ఆర్‌కే రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని ఏనాడూ కలిసిన దాఖలాలు లేవు అని చెప్పుకొచ్చారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ రోజా మండిపడ్డారు. లోకేశ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నాడని చెప్పుకొచ్చారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు అని చెప్పుకొచ్చారు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాం లు చేశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాంల గురించి తెలుసుకోవాలని సూచించారు. నారా భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుంది అని విమర్శించారు. చంద్రబాబు దోపిడీదారుడు అని అందరికీ తెలుసునన్నారు. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యుల తీరు చూస్తుంటే చంద్రబాబు టీమ్ వర్క్‌గా కుటుంబ సభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైంది అని మంత్రి ఆర్‌కే రోజా అన్నారు.

Read More Latest updates of Andhra Pradesh News



Next Story