వైసీపీని తరిమికొట్టేందుకు పోరాడుదాం: విశాఖ జనసేన నేతలతో లోకేశ్

by Disha Web Desk 21 |
వైసీపీని తరిమికొట్టేందుకు పోరాడుదాం: విశాఖ జనసేన నేతలతో లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఉత్తరాంధ్ర జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇన్‌చార్జి పీఎస్ఎన్ రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బుధవారం రాజమహేంద్రవరంలో లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు నాయుడుకు తమ మద్దతు ప్రకటించారు.స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని ఆరోపించారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు మద్దతు పలికిన జనసేన నేతలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని నారా లోకేశ్ తెలిపారు.



Next Story

Most Viewed