చిరుత మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి మండలం పొన్నిటిపాళ్యంలో వేటగాళ్లు ఉచ్చులో చిక్కుకుని చిరుత(cheetah) మృతి చెందిన సంగతి తెలిసిందే.

చిరుత మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి మండలం పొన్నిటిపాళ్యంలో వేటగాళ్లు ఉచ్చులో చిక్కుకుని చిరుత(cheetah) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిరుతతో పాటు దాని గర్భంలోని రెండు కూనలు కూడా మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన పై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు.

ఈ ఘటన పై వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు భారీగా పొన్నిటిపాళ్యం గ్రామానికి చేరుకున్నారు. ఈ తరుణంలో నిందితులను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే చిరుత మృతికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Next Story