శ్రీశైలం రింగ్ రోడ్డు సమీపంలో ఉరేసుకుని యువకుడు మృతి

by Disha Web Desk 16 |
శ్రీశైలం రింగ్ రోడ్డు సమీపంలో ఉరేసుకుని యువకుడు మృతి
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం రింగ్ రోడ్డు సమీపంలో సంతోష్ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు శ్రీశైలం దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ తోట మాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఏమైందో ఏమో గానీ ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని పోలీసులు కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేతికందిన కొడుకు ఆత్మహత్య చేసుకుని వికటజీవిగా కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



Next Story

Most Viewed