Warning: మీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతా?... లోకేశ్‌పై ఎమ్మెల్యే ఫైర్

by Disha Web Desk 16 |
Warning: మీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతా?... లోకేశ్‌పై ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో‌: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కిరాయి గుండాలతో పెట్టుకుని నడుస్తోందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. పంచాయితీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు లోకేశ్ ఏమి అభివృద్ధి చేయలేదు.. కానీ ఇప్పుడు తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానంటూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. యువగళం పాదయాత్రలో తమ కుటుంబ సభ్యుల గురించి విమర్శలు చేస్తే మీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతా.. మర్యాద ఉంటుందా? అంటూ ప్రశ్నించారు.

నారా లోకేశ్ ఒక సైకో అని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. భూకబ్జాలు చేసే అలవాటు నారా వారికి మాత్రమే చెల్లిందని ఆరోపించారు. పాదయాత్రలో లోకేశ్ పిచ్చి కూతలు కూస్తు ఉరురూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన చంద్రబాబు.. అర్హత లేకున్నా ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొని తిరుగుతున్నారంటూ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదోని నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ..ఆ నియోజకవర్గాన్ని కేక్ పీస్‌లా పంచుకున్నారంటూ లోకేశ్ ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్‌ రెడ్డి, ఆయన భార్య, కుమారుడు మనోజ్‌రెడ్డి భూకబ్జాలు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడ్డారని లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను భార్య చూసుకుంటుందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో అందుకు సాయిప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed