Kurnool: చిప్పగిరిలో ఉన్నట్టుండి మూడు గడ్డి వాముల దగ్ధం

by Disha Web Desk 16 |
Kurnool: చిప్పగిరిలో ఉన్నట్టుండి మూడు గడ్డి వాముల దగ్ధం
X

దిశ, చిప్పగిరి: కర్నూలు జిల్లా చిప్పగిరిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం మూడు గడ్డివాములు ఒక్కసారిగా దగ్ధమయ్యాయి. పశువుల కోసం వేసుకున్న గడ్డివాముల నుంచి మంటలు చేలరేగి వ్యాపించాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా గాలి తీవ్రతో మూడు గడ్డివాములు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.

Next Story