Done: ప్రశాంతంగా NMMS పరీక్ష

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-06 12:56:07  IST  )

డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాతపేటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయి...

Done: ప్రశాంతంగా NMMS పరీక్ష
X

దిశ, డోన్: డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాతపేటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్ వెంకట సుబ్బారెడ్డి, సిబ్బంది రామనరసప్ప, మైమున్నిసా, ప్రసాద్‌లు పర్యవేక్షించారు. బాలుర ఉన్నత పాఠశాలలో 384 మంది విద్యార్థులకు గానూ 362 మంది, బాలికల పాఠశాలలో 437 మంది విద్యార్థులకు 422 మంది పరీక్షలు రాశారని ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆదాం బాషా తెలిపారు. వీరి వెంట డిపార్ట్మెంట్ అధికారులుగా మౌలాలి, వెంకట రమణ, రాంప్రసాద్, ప్రసాద్ తదితరులు వ్యవహరించారు.

Next Story