Srisailam: 28 రోజుల్లో మల్లన్న హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..!

by Disha Web Desk 16 |
Srisailam: 28 రోజుల్లో మల్లన్న హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..!
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. 28 రోజులకు గాను 3 కోట్లకుపైగా హుండీల రాబడి వచ్చినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఉభయదేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో జరిగిందని చెప్పారు. సీసీ కెమెరాల మధ్య పకడ్బందీగా లెక్కింపు నిర్వహించారన్నారు. గడిచిన 28 రోజులలో 3 కోట్ల 17 లక్షల 50 వేల 290 రూపాయలు హుండీల లెక్కింపులో భక్తులు సమర్పించారని తెలిపారు. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల మధ్య ఆలయ అధికారులు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించామని ఈఓ పెద్దిరాజు అన్నారు. స్వామి అమ్మవార్లకు నగదుతో పాటు బంగారం, 6 కేజీల 340 గ్రాముల వెండి వివిద విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు హుండీ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారని ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు.

Next Story

Most Viewed