Kurnool: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ

by Disha Web Desk 16 |
Kurnool: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ
X

దిశ, కర్నూలు: కర్నూలు జిల్లా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. 2023-2024కు సంబంధించి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసేందుకు నేటి నుంచి నుండి ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు www.ipr.ap.gov.in వెబ్ సైట్‌ను అందుబాటులో ఉంచామన్నారు.

ప్రభుత్వం కొత్తగా అక్రిడిటేషన్ కార్డుల మంజూరు కోసం జీవో నెంబర్ 38 (30.3.2023)న జారీ చేసిందన్నారు. జర్నలిస్టులు తమ వివరాలతో పాటు యాజమాన్యాల సిఫారసు లేఖ, పాస్ పోర్టు సైజ్ ఫొటో, అవసరమైన డాక్యుమెంట్లు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేయాలని పేర్కొన్నారు.

Next Story

Most Viewed