Kurnool:14న జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం

by Disha Web Desk 16 |
Kurnool:14న జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం
X

దిశ, కర్నూలు: అమీలియో ఆస్పత్రి సహకారంతో జాప్ ఆధ్వర్యంలో ఈ నెల 14న కర్నూలు సమాచార భవన్‌లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో ఈసీజీ, 2డీ ఎకో, బీపీ, ఆర్ బీఎస్, హెచ్ బీ పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఈ వైద్య శిబిరానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాప్ సంఘం సీనియర్ నాయకులు సత్తార్, విజయ్, తుగ్గలి శ్రీనివాస్ గౌడ్‌ కోరారు.

Next Story