Gowru Charitha Reddy: అధికారంలోకి రాగానే అన్ని తీరుస్తాం..

by Vemula.Srinu Prasad |

రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు....

Gowru Charitha Reddy: అధికారంలోకి రాగానే అన్ని తీరుస్తాం..
X

దిశ, కర్నూలు: రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం చిన్నటేకూరులో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగా తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి విడతగా మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ ప్రజలను చైతన్య పరిచారు. టీడీపీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని తీరుస్తామన్నారు. అలాగే వైసీపీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని తమ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని వెంటనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.

Next Story