Srisalam: ఎట్టకేలకు బోనులో చిక్కిన ఎలుగుబంటి

by Disha Web Desk 16 |
Srisalam: ఎట్టకేలకు బోనులో చిక్కిన ఎలుగుబంటి
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ పరిసరాలలో సంచరిస్తున్న ఎలుగుబంటి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కొన్నిరోజులగా శిఖరేశ్వరం, ఇష్టకమేశ్వరి ఆలయ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. శిఖరం ఆలయం వద్ద భక్తులు సమర్పించిన కొబ్బరిచిప్పలు తింటూ ప్రతి రోజూ అటవీప్రాంతంలోకి వెళ్లి వస్తోంది. దీంతో భక్తులు, స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి కోసం సుమారు 30 మంది సిబ్బందితో 2 బోన్లు వేసి రెస్క్యూ ఆపరేషన్ చేయగా అది బోన్‌లో పడింది. అనంతరం ఎలుగుబంటిని ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.



Next Story

Most Viewed