- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Kurnool: టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీ కార్యకర్తలు?
దిశ, కళ్యాణదుర్గం: బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పాగా వేసేందుకు ప్రతిపక్ష, అధికార పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా టిడిపితో బీజేపీ పొత్తు కొనసాగిస్తుందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన అనంతపురం జిల్లా బీజేపీ కార్యకర్తలు టీడీపీతో పొత్తును వ్యతిరేకించారు. గతంలో ప్రధాని మోడీపై విమర్శలు చేసిన చంద్రబాబుతో ప్రమాదమని హెచ్చరించారు. తాము జనసేనతో పొత్తు పెట్టుకుంటామంటూ చంద్రబాబు అంటున్నారని, తాజాగా ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్నారు. చంద్రబాబు మాయమాటలను నమ్మే పరిస్థితిలో బీజేపీ లేదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు.