Dhone: అంత్యక్రియలకు చేయూత

by Disha Web Desk 16 |
Dhone: అంత్యక్రియలకు చేయూత
X

దిశ, డోన్: డోన్ రైల్వే 5వ ప్లాట్ ఫామ్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారు. కేసు నమోదు చేసిన డోన్ టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సేవా సమితికి సమాచారం ఇచ్చారు. దీంతో చనిపోయిన వ్యక్తికి కానిస్టేబుల్ సుధాకర్ ఆధ్వర్యం‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం వ్యక్తి మృతదేహాన్ని సేవా సైనికులకు అప్పజెప్పారు. దీంతో ఆ వ్యక్తికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు.

ఈ కార్యక్రమంలో షాదిఖానా రాజా, పానిపూరి మురళి, తాహెర్ బాషా,ఆటో సుధాకర్,ఫోటోగ్రాఫర్ బాబా,పోలీస్ కానిస్టేబుల్ సుధాకర్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైకుంఠ రథాన్ని రోటరిక్లబ్ రాజయ్య గౌడ్ ఉచితంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి అయిన ఖర్చు మొత్తం ప్రైవేట్ లెక్చరర్ యూనియన్ అధ్యక్షులు టి.చంద్ర శేఖర్ అందజేశారు.

Next Story

Most Viewed