ముఖ్యమంత్రి సొంతూరికి భారీ శుభవార్త

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-08 10:16:50  IST  )

చిత్తూరు జిల్లా కుప్పంకు గుడ్‌న్యూస్ లభించింది...

ముఖ్యమంత్రి సొంతూరికి భారీ శుభవార్త
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam)కు గుడ్‌న్యూస్ లభించింది. సొంత నియోజకవర్గం కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కుప్పాన్ని అభివృద్ధి చేసేందుకు ఒకేసారి 7 పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశారు. అమరావతి సచివాలయం(Amaravati Secretariat) నుంచి ఆయన వర్చువల్‌గా ఈ పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.2,203 కోట్లతో కుప్పంలో సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. ఈ కంపెనీల ఏర్పాటుతో కుప్పం మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రజాపతినిధులతో సీఎం చంద్రబాబు ఆన్ లైన్ ద్వారా ముచ్చటించారు. భవిష్యత్తులో కుప్పంకు మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Next Story