- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు కేంద్రమంత్రి కుమారస్వామి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సంఘటనలో 9 మంది మరణించినట్లు చెబుతున్నారు. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాద సంఘటన వద్దకు అర్ధరాత్రి కేంద్ర మంత్రి కుమారస్వామి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రమాద సంఘటన స్థలాన్ని కుమారస్వామి పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం కేంద్రమంత్రి కుమారస్వామి కీలక ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షల రూపాయల చొప్పున అందిస్తామని స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబంలో అర్హత గల ఒకరికి ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన వివరించారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేస్తూ పోస్టు పెట్టారు.
ವಿಶಾಖಪಟ್ಟಣ ರಾಷ್ಟ್ರೀಯ ಉಕ್ಕು ಸ್ಥಾವರದಲ್ಲಿ (RINL) ಸಂಭವಿಸಿದ ಅವಘಡದಲ್ಲಿ ಗಾಯಗೊಂಡು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿರುವ ಕಾರ್ಮಿಕರನ್ನು ಭೇಟಿಯಾಗಿ ಅವರ ಯೋಗಕ್ಷೇಮ ವಿಚಾರಿಸಿ ಶೀಘ್ರ ಗುಣಮುಖರಾಗುವಂತೆ ಹಾರೈಸಲಾಯಿತು. ಗಾಯಾಳು ಕಾರ್ಮಿಕರ ಚಿಕಿತ್ಸೆಯ ವೆಚ್ಚವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಾರ್ಖಾನೆಯೇ ಭರಿಸಲಿದೆ ಹಾಗೂ ಗಾಯಾಳುಗಳಿಗೆ ₹10… pic.twitter.com/rvyyc1GPEO
— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy (@hd_kumaraswamy) June 8, 2026






