Breaking: కాసేపట్లో గుడివాడకు చంద్రబాబు.. శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
Breaking: కాసేపట్లో గుడివాడకు చంద్రబాబు.. శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో గుడివాడలో పర్యటించనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని గతంలో టీడీపీలో పని చేశారు. కానీ ఆయన టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా రోజులు గడిచిపోయాయి.

తాజాగా చంద్రబాబు గుడివాడలో పర్యటించనుండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జెండా విషయంలో వివాదం తలెత్తడంతో స్థానిక శరత్ థియేటర్ వద్ద ఇరువర్గాలు పరస్పరం దాడుల చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేపట్టారు.

Next Story