- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Machilipatnam: హోంమంత్రి అనిత పర్యటనలో భద్రతాలోపం
హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటనలో భద్రతాలోపం వెలుగు చూసింది..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) పర్యటనలో భద్రతాలోపం వెలుగు చూసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఇంటికి వెళ్లేందుకు ఈ సాయంత్రం హోంమంత్రి అనిత పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఈ పర్యటనలో ఉద్రిక్తలను సృష్టించేందుకు కొందరు వైసీపీ మహిళలు ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. దీంతో మచిలీపట్నం పర్యటనను హోంమంత్రి వాయిదా వేసుకున్నారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లకుండా వెనుతిరిగారు. అయితే వైసీపీ నేతలకు కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి సహకరిస్తున్న పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






