పేర్ని నానికి నోటీసులు..పెడన వెళ్లొద్దని ఆదేశం

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసుల నోటీసులు జారీ చేశారు...

MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)కి పోలీసుల నోటీసులు జారీ చేశారు. పెడనకు వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. పెడనలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ(Babu Surety.. Fraud Guarantee) కార్యక్రమానికి వెళ్లేందుకు పేర్ని నాని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేవంటూ ఆయనకు నోటీసులు చేశారు.

కాగా గుడివాడలో వైసీపీ నేతలు శనివారం బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కొడాలి నానికి చెందిన కే.కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ శ్రేణులు నాగవరప్పాడు జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ సమయంలో వైసీపీ చైర్ పర్సన్ ఉప్పల హరిక అటుగా వెళ్లారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆమె కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారు ధ్వంసం అయింది. ఈ విషయం వైసీపీ శ్రేణులకు తెలియడంతో వాళ్లు కూడా నాగవరప్పాడు జంక్షన్ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఈ దృష్ట్యా పెడనలో నిర్వహిస్తున్న బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వెళ్లేందుకు పేర్ని నాని యత్నించారు. దీంతో అనుమతి లేదంటూ పేర్ని నానికి నోటీసులు జారీ చేశారు.

Next Story