- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Mp Kesineni Nani: ఆ శక్తి చంద్రబాబుకే ఉంది
దిశ, డైనమిక్ బ్యూరో: దేశానికి, రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడని.. రాష్ట్రాన్ని ముందుకు నడపగలిగే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని కొనియాడారు. విజయవాడలోని ఎంపీ కార్యాయలంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ కేశినేని నాని కేక్ కట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. తెలుగు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప ఆయన స్వార్థం కోసం ఎప్పుడు పని చేయలేదన్నారు. టీడీపీ హయాంలో చాలా కేంద్ర సంస్థలు, ప్రాజెక్టులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశారని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్(అన్న), ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు,కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు,మైనార్టీ నాయకులు M.S. బేగ్ ఇతర నాయకులు అభిమానులు పాల్గొన్నారు
ఇవి కూడా చదవండి : Ganta Srinivasarao: చంద్రబాబు సీఎం కావడం చారిత్రాత్మక అవసరం