Vijayawada: ఏపీలో పవన్ కల్యాణ్ ప్రభావంపై మంత్రి ఉషశ్రీ సెటైర్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-10-09 12:59:27  IST  )

ఏపీలో పవన్ కల్యాణ్‌ ప్రభావం ఏమీ ఉందని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. ..

Vijayawada: ఏపీలో పవన్ కల్యాణ్ ప్రభావంపై మంత్రి ఉషశ్రీ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పవన్ కల్యాణ్‌ ప్రభావం ఏమీ ఉందని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారామె. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. డైవర్షన్ రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేంకాదని, పవన్ కల్యాణ్ టీడీపీ పొత్తు సైతం కొత్తకాదన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పటి నుంచో టీడీపీతోనే ఉన్నారని చెప్పారు. ఏపీ, రాయలసీమలోనే పవన్ కల్యాణ్ వారాహి ప్రభావం చూపించలేదన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తోందని జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేనతో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని మంత్రి ఉషా శ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బండారును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story