Breaking: మాజీ మంత్రి జోగి రమేష్‌కు చుక్కెదురు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-18 09:39:58  IST  )

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు చుక్కెదురు అయింది..

Breaking: మాజీ మంత్రి  జోగి రమేష్‌కు చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)లో మాజీ మంత్రి జోగి రమేష్‌(Former Minister Jogi Ramesh)కు చుక్కెదురు అయింది. ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో జోగి రమేష్‌తో పాటు జోగి రాములు, అద్దేపల్లి బ్రదర్స్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇదే కేసులో మరో ఏడుగురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. మిగిలిన వారి రిమాండ్‌ను ఈ నెల 31 వరకు పొడిగించింది.

కాగా ఈ కేసులో జోగి రమేష్ ఏ18 కాగా, జోగి రాము ఏ19గా, ఏ2గా జగన్ మోహన్ రావు ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో వీరిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్ గడువు పొడిగించడంతో తిరిగి జైలుకు తరలించారు.

Next Story