- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Vangaveeti Ranga Issue: దేవినేని అవినాశ్ వర్సెస్ బోండా ఉమా
దిశ, వెబ్ డెస్క్: వంగవీటి రంగా హత్య అంశం ఏపీలో రాజకీయ వేడిని రేపింది. 'రంగా వర్థంతి' సందర్భంగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం అయ్యాయి. రంగా హత్య కుట్ర చేసిన వాళ్లు టీడీపీలో చేరారని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు.
తాజాగా బోండా ఉమా, దేవినేని అవినాశ్ మధ్య మాటల యుద్ధం సాగింది. రంగా చనిపోయిన రోజు దేవినేని నెహ్రూ పక్కనే ఉన్నారని.. కొడాలి నాని నెహ్రూ దొడ్డిలో ఉన్నాడని బోండా ఉమా ఆరోపించారు. రంగా వర్థంతిని ఏ సామాజిక వర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి ఎవరు అని ఆయన ప్రశ్నించారు.
ఇందుకు వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమా ఒక చిల్లర వ్యక్తి అని, బజారు మనిషి అని విమర్శించారు. బోండా ఉమా కుటుంబంపై చెప్పాలంటే చాలా ఉందని దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు.
కాగా దేవినేని నెహ్రూ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని అవినాశ్ 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరారు..