- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Tragedy: 15 రోజుల్లో పెళ్లి.. అంతలోనే దుర్మరణం

దిశ, జగ్గంపేట: మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. మరో 15 రోజుల్లో భార్యాభర్తలు కావాల్సిన యువతీ, యువకుడు మృత్యు ఒడిలోకి చేరారు. జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామానికి చెందిన మానేపల్లి వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమారుడు రాజ్కుమార్ (25 ), కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన మలిరెడ్డి సత్తిబాబు, పార్వతి దంపతుల కుమార్తె దుర్గ భవాని (18) పెళ్లి సామాగ్రి కొనుక్కునేందుకు రాజమహేంద్రవరం బయలుదేరారు. కొంతమూరులో గామన్ ఇండియా వంతెన వద్ద వెనుక నుంచి లారీ ఢీ కొట్డడంతో బైక్పై వెళుతున్న కాబోయే నవయువ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బొమ్మూరు సీఐ కాశీవిశ్వ నాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బంధువులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read...
Breaking: శ్వేతను వేధించలేదు.. సర్దుకోవాలని చెప్పా: భర్త మణికంఠ