Gudivada: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు

by Disha Web Desk 16 |
Gudivada: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు
X

దిశ, ఏపీ బ్యూరో: గుడివాడలో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొన్న గొడవతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీని తిడుతూ వైసీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. స్థానిక శరత్ థియేటర్ దగ్గర వైసీపీ నాయకులు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు అనుచరులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నేతలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అయితే దాడి నేపథ్యంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై బాధ్యత తీసుకుంటానన్న బొత్స..రాజీనామా చేయాలి కదా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. అప్పుడే విలువలతో కూడిన రాజకీయం చేసినట్టు అవుతుందన్నారు. ఏపీలో ఫేక్ గేమ్వార్ బాగా నడుపుతున్నారని, సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తున్నా రని చంద్రబాబు మండిపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి ప్రాణహాని ఉందంటున్నారని..ఆమెకు రక్షణ కల్పిస్తామన్నారు. గతంలో ఎంపీ రఘురామకు రక్షణ కల్పించినట్టే ఆమెకూ అండగా ఉంటామని చంద్రబాబు భరోసానిచ్చారు.

ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే ధ్యేయమని, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని, వైసీపీ నేతలు బానిసల్లా బతుకుతున్నారని అన్నారు. తమ బలానికి తగ్గట్లే తాను పోటీకి పెట్టానని, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను గాడిదల్లా కొనలేదా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే వారు తమకు సపోర్టు చేస్తే తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ముందస్తు వచ్చినా తాము సిద్ధమేనని, తాము రెడీగా లేమని జగన్ పగటి కలలు కంటున్నారని, ప్రజలు టీడీపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, చెత్తమీద పన్ను..ఆస్తి పన్ను భారంగా మారాయన్నారు. ఆస్తి పన్నులో చెత్త పన్నును కలిపేశారని, ఇవాళ ఒకటో తేదీ ఎవరికైనా జీతాలు పడ్డాయా..? అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Next Story

Most Viewed