దేవాలయాల్లో చోరీలు.. ఐదుగురు నిందితుల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

దేవాలయాల్లో చోరీల కేసును కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు ఛేదించారు...

దేవాలయాల్లో చోరీలు.. ఐదుగురు నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: దేవాలయాల్లో చోరీల కేసును కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు ఛేదించారు. ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి రూ. 27 లక్షలు విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత 4 నెలలుగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించారని చెప్పారు. అదుపులోకి విచారించడంతో చోరీల వ్యవహారం బయటపడిందన్నారు. నిందితులుమైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన ముగ్గురు, ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగర్‌కు చెందిన ఇద్దరిగా తెలిపారు. ఇప్పటివరకూ నిందితులపై పది కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

Next Story