లోకేశ్‌తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ

by Disha Web Desk 10 |
లోకేశ్‌తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో ఇటీవలే చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో వరుస భేటీలు అవుతున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అందివచ్చిన ప్రతీ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు లోకేశ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం, జిల్లా రాజకీయాలపై ముచ్చటించారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని లోకేశ్‌ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి సూచించారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించాలని నారా లోకేశ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఒట్టూరు సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed