- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 లక్షలకు వీడియోలు అమ్ముకున్నాడు..డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు
శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోటా వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో వినూత దంపతులు షాకింగ్ నిజాలను చెప్పినట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోటా వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో వినూత దంపతులు షాకింగ్ నిజాలను చెప్పినట్టు సమాచారం. కోటా వినూత బెడ్ రూంలో డ్రైవర్ శ్రీనివాస్ తన ఫోన్ కెమెరా పెట్టినట్టు పోలీసుల విచారణలో చెప్పారు. మార్చిలో ఆ ఫోన్ గుర్తించగా శ్రీనివాస్ ను మందలించినట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తమపై స్పై చేసేందుకు శ్రీనివాస్ ను వాడుకున్నట్టు తెలిపారు.
ఇంట్లో రికార్డ్ చేసిన వీడియోలను శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యేకు రూ.30 లక్షలకు అమ్మాడని వినూత దంపతులు పోలీసుల విచారణలో చెప్పారు. ఆ వీడియోలతో తన వర్గీయుల ద్వారా ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్కు పాల్పడటంతో విషయం తెలిసి శ్రీనివాస్ ను విధుల నుండి తొలగించినట్టు వెల్లడించారు. శ్రీనివాస్ పై దాడి చేసి తమ ఇంట్లోనే బంధించగా పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.






