AP Elections 2024: నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి.. కోనసీమ జిల్లా కలెక్టర్

by Disha Web Desk 3 |
AP Elections 2024: నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి.. కోనసీమ జిల్లా కలెక్టర్
X

అమలాపురం దిశ ఏప్రిల్ 17 ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈనెల 18 వ తేదీ నుండి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు 2024 కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా, ఎన్నికల అధికారి హిమాన్షు బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో నామినేషన్లు స్వీకరించడo జరుగుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాలో కొత్తపేట, పి గన్న వరం, అమలా పురం, ముమ్మిడి వరం, రాజోలు, రామచంద్రపురం , మండపేట.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల లోనూ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరిస్తారని పేర్కొన్నారు.

నామినేషన్ల స్వీకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఈనెల 18 న విడుదల అవుతుందని స్పష్టం చేశారు. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రభుత్వ సెలవులు మినహాయించి కార్యాలయ పని వేళ్లలో ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిచడం జరుగుతుందన్నారు.

29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం అభ్యర్థులకు ఉందన్నారు. అలానే ఉపసంహరణ అనంతరం పోటిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. మే 12న పోలిం గ్ సిబ్బందికి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, స్టేషనర్ ఇతర పోలింగ్ సామాగ్రి అందజేసి, ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని వాహనాల్లో తరలించనున్నట్లు ఆయన తెలిపారు.

మే 13న పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో గతంలో కన్న ఓటింగ్ శాతాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోoదని తెలి పారు. ఏపిక్ కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి గుర్తింపుగా చూపించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఎన్నికల సంఘం, పోలింగ్ ప్రెస్, వీడియో కవరేజ్ విధులలో నిమగ్నమై వుండి గుర్తింపు పత్రాలుగల పాత్రికేయులకు కూడా పోస్టల్ బ్యారెట్ ఓటింగ్ సౌలభ్యం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు విని యోగించుకునేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, జనం రద్దీగల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మొదలైన ప్రాంతాల్లో ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు.

నగదు ,మద్యం, గిఫ్ట్ ఆర్టికల్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకై జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్విస్తున్నామన్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లాల్సి వస్తే ఆధారాలు తప్పనిసరిగా చూపాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో చెక్ పోస్టులతోపాటు ఎస్‌ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు పేర్కొన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed