- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీఐ కాలేజీలో కత్తితో దాడి.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
by Vemula.Srinu Prasad |
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఉన్న కొమ్మనబోయిన బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో శుక్రవారం జరిగిన కత్తి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ..

X
దిశ, బాపట్ల ప్రతినిధి: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఉన్న కొమ్మనబోయిన బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో శుక్రవారం జరిగిన కత్తి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో షేక్ హుస్సేన్ (65) అనే వ్యక్తి మృతి చెందగా, కటకం శేషయ్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి షేక్ సత్తార్, ఆయన కొడుకు జిలాని పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా కళాశాలకు చెందిన భాగస్వాముల మధ్య గత 12 సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లెక్కలు చెప్పాలని కోరుతూ వచ్చిన భాగస్వాములపై సత్తార్, ఆయన కుమారుడు జిలానితో కలిసి దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే దాడికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Next Story






