బెజవాడలో పిల్లలు అమ్మే ముఠా కేసులో కీలక పరిణామం

by Muthe.Rajitha |

బెజవాడలో పిల్లలను అక్రమంగా అమ్ముతున్న ముఠా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బెజవాడలో పిల్లలు అమ్మే ముఠా కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : బెజవాడలో పిల్లలను అక్రమంగా అమ్ముతున్న ముఠా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు మరింత విచారణ కోసం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేశారు. అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక టీమ్స్‌తో సిట్‌ను ఏర్పాటు చేసి, ఇప్పటికే ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా బృందాలను పంపించారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.

Next Story