ఇచ్చిన మాట ప్రకారం అడుగుపెట్టాం.. MP రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ఇచ్చిన మాట ప్రకారం అడుగుపెట్టాం.. MP రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. సిద్ధం అంటూ అధికార వైసీపీ నేతలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సంసిద్ధం అంటూ టీడీపీ నేతలు సైతం బరిలోకి దిగారు. ఈ క్రమంలో మేమూ సిద్ధమే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 'శంఖారావం' పేరిట నారా లోకేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఇచ్ఛాపురంలో తెలుగుదేశం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పసుపు జాతరే అన్నారు. ఇచ్ఛాపురంలో యువగళం పాదయాత్ర ముగించాల్సి ఉన్నా అవాంతరాల వల్ల రాలేకపోయారని, ఇచ్ఛాపురం వస్తానని ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ ఈ గడ్డపై శంఖారావంతో ఇప్పుడు అడుగుపెట్టారని తెలిపారు. రెడ్ బుక్‌లో పేర్లున్న అధికారులు, నేతలు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అని హెచ్చరికలు చేశారు. జగన్ రెడ్డి పాలన అంతానికి లోకేష్ శంఖారావం పూరించారని, ఈ శంఖారావం మనం కోసం, రైతులు, యువకులు, బడుగు, బలహీనవర్గాల కోసం అని తెలిపారు. జగన్ రెడ్డిని నమ్మి రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని, ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో గడిపిన జగన్ రెడ్డి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.

Next Story

Most Viewed