‘కచ్చితంగా పోటీ చేస్తా.. ఎక్కడి నుంచి అనేది చంద్రబాబును అడగండి’

by Disha Web Desk 2 |
‘కచ్చితంగా పోటీ చేస్తా.. ఎక్కడి నుంచి అనేది చంద్రబాబును అడగండి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో పోటీపై కీలక నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును రఘురామ కృష్ణంరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేస్తాననే విశ్వాసం తనకు ఉందని అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తానో ఇంకా క్లారిటీ రాలేదని.. ఆ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే నేరుగా చంద్రబాబునే అడగండి అని తెలిపారు. చంద్రబాబుతో జరిపిన చర్చల వివరాలు మాత్రం రఘురామ బయటకు చెప్పలేదు. మరోవైపు పాలకొల్లు సభలో చంద్రబాబు సమక్షంలో రఘురామ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని ఆయన అనుచరుల ద్వారా తెలిసింది.



Next Story

Most Viewed