ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-20 17:16:23  IST  )

కర్ణాటక ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది....

ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఆర్టీసీ బస్సు(Karnataka RTC bus)కు ప్రమాదం జరిగింది. వర్షం పడటంతో బస్సు అదుపు తప్పింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పక్కనున్న గుంతలోకి బస్సు ఒరిగిపోయింది. శ్రీశైలం(Srisailam) నుంచి బెంగళూరు(Bengaluru)కు వెళ్తుండగా ఈ ఘటన దోర్నాల ఘాట్ రోడ్డు(Dornala Ghat Road)లో జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే వీరిని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు(APS RTC bus)లో దోర్నాలకు తరలించారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపారు. ఈ ఘటనపై రెండు రాష్ట్రాల అధికారులు ఆరా తీశారు.

Next Story