Kanna Lakshminarayana : టీడీపీ నేత కన్నాకు జగన్ సర్కార్ ఝలక్

by Disha Web Desk 21 |
Kanna Lakshminarayana : టీడీపీ నేత కన్నాకు జగన్ సర్కార్ ఝలక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నేత,సత్తెనపల్లి ఇన్‌చార్జి కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కన్నా లక్ష్మీనారాయణకు సెక్యూరిటీని తొలగించింది. కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. భద్రత తొలగింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గన్‌‌మెన్‌లను తొలగించడం సరికాదని టీడీపీ అంటుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడితోనే గన్‌మెన్‌లను ఉపసంహరించుకుందని ఆరోపిస్తుంది.ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్‌లుగా ఉన్న పోలీసులు గత మూడు రోజులుగా విధులకు రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఆరా తియ్యగా భద్రత ఉపసంహరించుకున్నట్లు తెలిసిందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కన్నా లక్ష్మీనారాయణ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed