ఆ ముగ్గురు ఏపీ ఆత్మగౌరవాన్ని KCR కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు: KA పాల్ ఫైర్

by Satheesh |   (  Updated:2023-01-02 07:00:23  IST  )

బీఆర్ఎస్‌లో చేరనున్న ఏపీ నేతలు రావెల కిషోర్, తోట చంద్రశేఖర్, పార్థసారధిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ తీవ్ర విమర్శలు చేశారు.

ఆ ముగ్గురు ఏపీ ఆత్మగౌరవాన్ని KCR కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు: KA పాల్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌లో చేరనున్న ఏపీ నేతలు రావెల కిషోర్, తోట చంద్రశేఖర్, పార్థసారధిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. డబ్బులకు ఆశపడే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. విలువల లేని రాజీకయాలకు తోట చంద్రశేఖర్ తెరతీశారని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి రావెల కిశోర్ ఓ అవినీతి చక్రవర్తి అని ఎద్దేవా చేశారు. నీతి నియమాలు లేనివారే కేసీఆర్ పార్టీలో చేరుతారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌లో చేరే ముగ్గురు నేతలు.. ఏపీ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అన్నారు.

Also Read...

chandrababu ''మాకు ఇదేమి ఖర్మ'': KA Paul తీవ్ర విమర్శలు

Next Story