Gandi Babji: చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే..

by Disha Web Desk 3 |
Gandi Babji: చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే..
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ గండి బాబ్జి అన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నేడు జ్యోతిరావు పూలే 198వ జయంతి. ఈ సందర్భంగా గురువారం జిల్లా బిసి సెల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో.. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి బాబ్జి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో బాబ్జి మాట్లాడుతూ.. భారతదేశంలో ఈరోజు మనం అనుభవిస్తున్న గౌరవానికి కారణం పూలే అని చెప్పారు. అందుకనే ఆరోజు అంబేద్కర్ కూడా ఆయనను పొగిడారని పేర్కొన్నారు.

అటువంటి మహాత్ముడు పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని.. మనలో ప్రతి ఒక్కరు కూడా సాటి మనిషికి సాయం చెయ్యాలని పిలుపునిచ్చారు. సమాజానికి కొంచమైనా మంచిచేస్తూ బ్రతికితే మన జీవితానికి ఒక అర్దం ఉంటుందని తెలిపారు. ఈ రోజు మహిళలు స్వతంత్రంగా జీవిస్తున్నారంటే ఆరోజు ఆ మహానుభావుడు చేసిన కృషి అని కొనియాడారు.



Next Story