టీడీపీ నేతలను కేసుల్లో ఇరికించేది జేసీ ప్రభాకర్ రెడ్డే: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

by Disha Web Desk 21 |
టీడీపీ నేతలను కేసుల్లో ఇరికించేది జేసీ ప్రభాకర్ రెడ్డే: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ కార్యకార్తలు, నాయకులను అన్యాయంగా కేసుల్లో ఇరికించి బలి చేస్తున్నారని ధ్వజమెత్తారు. యాడికిలో ప్రజా సంక్షేమ పాదయాత్రలో పాల్గొన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు. జేసీ ప్రభాకర్‌‌రెడ్డిని చూసి టీడీపీ కార్యకర్తలు అతిగా కొట్టుకోవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.జేసీ ప్రభాకర్ రెడ్డి తన కొడుకును ఎమ్మెల్యే చేసేందుకు టీడీపీ నేతలను బలి చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి.. హైదరాబాద్‌లో జల్సాలు చేస్తుంటారని విమర్శించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తించాలన్నారు. ఎప్పుడు సమస్య వచ్చినా.. రేపో మాపో పాడి ఎక్కేవాడు వీడు చేస్తున్నాడు. అతడి కుమారుడిని మాత్రం హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చోబెడుతున్నాడు అంటూ ధ్వజమెత్తారు. జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేందుకు మీరు కావాలి.. మీ ఓట్లు కావాలి..అలాగే గొడవలకు మీ కుటుంబాలు బలికావాలా అని కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు.


Next Story

Most Viewed