అమరుడు మురళీనాయక్‌ అంత్యక్రియలు.. కన్నీటి వీడ్కోలు పలికిన ప్రజలు

by Vemula.Srinu Prasad |

అమరుడు మురళీనాయక్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ముగించారు..

అమరుడు మురళీనాయక్‌ అంత్యక్రియలు.. కన్నీటి వీడ్కోలు పలికిన ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌(Pakistan)తో జరిగిన పోరటంలో అమరుడైన జవాన్ మురళీ నాయక్(Jawan Murali Naik) అంత్యక్రియలు(Funeral) పూర్తి అయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండా(KalliTanda)లో ఆయనకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. అధికారిక లాంఛనాలతో మురళీనాయక్ భౌతికకాయానికి ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. అంతకుముందు జవాన్ భౌతికకాయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించారు.

Next Story