మన్యం జిల్లాలో పచ్చకామెర్ల కలకలం.. 360 మంది విద్యార్థులకు టెస్టులు

by Naga Rani Yarlagadda |

పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామెర్ల కలకలం రేగింది.

మన్యం జిల్లాలో పచ్చకామెర్ల కలకలం.. 360 మంది విద్యార్థులకు టెస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామెర్ల కలకలం రేగింది. ఇటీవల కురుపాం మండల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్లతో మరణించడంతో.. అక్కడి గ్రామస్తుల్లో అలజడి రేగింది. దీంతో కురుపాం మోడల్ స్కూల్లో 360 మంది విద్యార్థులకు బ్లడ్ టెస్టులు చేయగా.. 30 మందికి పచ్చకామెర్లు సోకినట్లు నిర్ధారణ అయింది. వారిలో 17 మంది విద్యార్థులకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో, కేజీహెచ్ లో ఇద్దరికి, కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రంలో మరో నలుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్కూల్లో పచ్చకామెర్ల కేసులు పెరగడంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Next Story