ఓహో.. మెగా బ్రదర్స్‌పై విమర్శలు అందుకేనా..?

by Disha Web Desk 16 |
ఓహో.. మెగా బ్రదర్స్‌పై విమర్శలు అందుకేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం లేక వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహనరావు (గాంధీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా బ్రదర్స్‌పై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భీమవరంలో ఓటమి ఖాయమైందని, అందుకే అక్కడి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రజల దృష్టి మళ్లించేందుకే మెగా బ్రదర్స్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ సమయంలో చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.


కూటమి అభ్యర్ధుల గెలుపు అడ్డుకోలేమని అర్థమై వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని రామ మోహనరావు వ్యాఖ్యానించారు . వైసీపీ పాలనను ప్రజలు విశ్వసించే పరిస్థిలేదన్నారు. పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీ నాయకులకు లేదని సెటైర్లు వేశారు. భీమవరంలో ఖాళీ స్థాలాలను కబ్జా చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన భూ బకాసురుడు గ్రంథి శ్రీనివాస్ అని అక్కల రామ మోహనరావు విమర్శించారు.



Next Story

Most Viewed