రక్తం పీల్చేస్తున్నారు.. బతికుంటానో లేదో తెలియదు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
రక్తం పీల్చేస్తున్నారు.. బతికుంటానో లేదో తెలియదు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం పవన్ నరసాపురంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ అధికార వైసీపీ‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతూ.. ప్రజలను ఇబ్బందుకులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రక్షాళన, పరివర్తన కోసమే తన పోరాటం అని.. ఈ పోరాటంలో చివరి వరకు తాను బతికుంటానో లేదో తెలిదయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది ప్రజల చెమట, రక్తాన్ని పీల్చేస్తున్నారన్నారు.

సీఎం జగన్‌కు చెబుతున్నా.. రోజులు మారాయ్.. మాటలతో మోసం చేసే కాలం కాదు.. తిరగబడే కాలమని హెచ్చరించారు. తనను తిట్టినా భరిస్తా.. ద్వేషించినా భరిస్తా.. రెండు చెప్పులు ఎత్తుకెళ్లిన భరిస్తా.. కానీ అవినీతి, గుండాయిజం చేస్తామంటే మాత్రం అస్సలే భరించనని వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నేను ఓడిపోయిన దాని కంటే అవినీతి చేసిన వాళ్లు గెలవడం ఎక్కువ బాధకు గురి చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలు ఉన్న తాను ఎందుకు ఓడిపోయానని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయని.. గతంలో జగన్ హైదరాబాద్‌లో కూర్చుని దందాలు చేసే వారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి : Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ను చూసి కన్నీరు పెట్టుకున్న నోరులేని పూజారి (వీడియో)

Next Story

Most Viewed