- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మంగళగిరిలో ఓటు వేసిన పవన్.. ఫ్యాన్స్కు కీలక పిలుపు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు....

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన సిబ్బందిని కలిశారు. పవన్ చేతి వేలిపై సిరా ముద్ర వేసి ఈవీఎం మిషన్ల వద్దకు పంపారు. దీంతో పవన్ కల్యాణ్ ఓటు వేశారు. పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ బరిలోఉన్నారు. ఇక పవన్ కల్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి పంపించేశారు. ఓటు వేసిన అనంతరం పవన్ కల్యాణ్ కీలక సందేశం ఇచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని కోరారు. అటు తన అభిమానులకు సైతం సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు, గుంపులుగా ఉండొద్దని పిలుపునిచ్చారు.






