అల్లు అర్జున్‌ను CM రేవంత్ రాకి రాంపాన పెట్టారు.. జనసేన నేత ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |

బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాటపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetti Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్‌ను CM రేవంత్ రాకి రాంపాన పెట్టారు.. జనసేన నేత ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాటపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetti Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) పోస్టు పెట్టారు. ‘హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఎవరి వైఫల్యం వల్ల జరిగింది అనేది పక్కన పెడితే.. ఒక ప్రాణం పోయింది అనేది వాస్తవం. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun)ను బాధ్యుడ్ని చేసి రాకి రాంపాన పెట్టారు. సరిగ్గా నిన్న కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సేమ్ అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వారిపై నిందలు వేయడం కంటే ముందు.. తప్పు ఎక్కడ జరిగింది అనేది వెతకాలి. ఆ తప్పు మళ్ళీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కక్ష సాధింపు ధోరణి మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరుగకుండా చూడాలి. భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియంత్రణతో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి.. బాధ్యతగా వ్యవహారించాలి’ అని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.

Next Story