Pawan Kalyan :ఇది కలింగాంధ్ర కాదు.. కలబడే ఆంధ్ర.. Janasena అధినేత పవన్ కల్యాణ్

by Dishafeatures2 |
Pawan Kalyan :ఇది కలింగాంధ్ర కాదు.. కలబడే ఆంధ్ర.. Janasena అధినేత పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇది కలింగాంధ్ర కాదు.. కలబడే ఆంధ్ర అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ వివేకానంద జయంతి పురస్కరించుకొని జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకులం జిల్లా తాళ్లవలసలో యువశక్తి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ ప్రసంగం మొదలు పెట్టి యువతలో ఉత్సాహాన్ని నింపారు. పోరాటంలో నాకు ఓనమాలు నేర్పింది ఉత్తరాంధ్రే ప్రాంతమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నటనతో పాటు తనలో చైతన్యాన్ని నింపిన గడ్డ ఉత్తరాంధ్ర అని అన్నారు. ప్రజా పోరాటంలో తానెవరికీ భయపడబోనని, అవసరమైతే ప్రజల కోసం తన ప్రాణాలు కూడా ఇస్తానని పవన్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమానమేనని, తప్పు చేసినవాళ్లు నాయకులైనా సరే నిలదీయాల్సిందేనని స్పష్టం చేశారు. నాయకులకేమైనా కొమ్ములుంటాయా అని జనసేనాని తెలిపారు. ప్రతి ఎదవ, సన్నాసి చేత మాటలు అనిపించుకున్నానని, ప్రజల కోసం ఎంతవరకైనా సిద్ధం అని పవన్ స్పష్టం చేశారు.

వీరసింహారెడ్డి ఫ్లెక్సీపై వైసీపీ ఎమ్మెల్యే ఫోటో


Next Story

Most Viewed