నేడు జ‌గ‌న్ సంచ‌ల‌న ప్రెస్ మీట్

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

నేడు జ‌గ‌న్ సంచ‌ల‌న ప్రెస్ మీట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది వైసీపీ పార్టీ. బుధవారం వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ బాధితులను జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ బాధితులకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కూటమి సర్కార్ పాలనపై ఇవాళ్టి మీడియా సమావేశంలో జగన్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే నేటి ప్రెస్ మీట్ లో తన పాదయాత్ర పై కీలక ప్రకటన చేస్తాడని కూడా అంటున్నారు.

Next Story