చంద్రబాబుపై మరోసారి జగన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
చంద్రబాబుపై మరోసారి జగన్  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు డ్రామా చూస్తుంటే ఆశ్చర్యమనిపించిందన్నారు. వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని ఇప్పుడు యుగపురుషుడు, రాముడు, కృష్ణుడు అని కీర్తిస్తున్నారని ఎన్టీఆర్ ని ఉద్దేశించి అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడిచేందుకు వెనకాడరన్నారు.

ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో.. తర్వాత గెలిపించిన ప్రజలను పొడవడం బాబు పొలిటికల్ ఫిలాసఫీ అంటూ ఫైర్ అయ్యారు. మేనిఫెస్టో ఎలా రూపొందిస్తారో బాబుకు తెలుసా అన్నారు. ప్రజలు గుండె చప్పుడుగా వైసీపీ మేనిఫెస్టో పుట్టిందన్నారు. మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టిందన్నారు. బాబు మేనిఫెస్టో మన రాష్ట్రంలో పుట్టలేదన్నారు. బాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందన్నారు. డ్రామా కంపెనీ మాదిరిగా రాజమండ్రిలో మహానాడు నిర్వహించారన్నారు. నమ్మిన రైతులను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు.

Read more:

రైతులకు సీఎం గుడ్ న్యూస్

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed